ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విజయ్కుమార్కు సన్మానం
నార్నూర్, మే.3: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విజయ్కుమార్కు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ హాజరై, బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విజయ్కుమార్ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్కుమార్ నార్నూర్ మండలంలో ఎస్ఐ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలు కాపాడడంలో ముఖ్యపాత్ర పోషించారన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనడంతో సహా, వాగులు, వంకలు దాటి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు యువత వ్యసనాలకు అలవాటుపడకుండా క్రీడాపోటీలు నిర్వహించారని గుర్తు చేశారు. ఎస్ఐ విజయ్కుమార్ మరిన్ని ఉద్యోగోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు, వ్యాపారులు, యువకులు, క్రీడాకారులు ఎస్ఐని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్కుమార్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ పరమేశ్వర్, సహకార సంఘం వైస్ చైర్మన్ సురేశ్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్దేవ్, విద్యావేత్త బాలాజీకాంబ్లే, పోలీస్ యూత్ మండలాధ్యక్షుడు పెందోర్ దీపక్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ రమేశ్, మహేందర్, హన్మంత్రావ్, సయ్యద్ఖాసీం, దాదేఅలీ, లవ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.