జయశంకర్ భూపాలపల్లి : గొర్రెల మందపై డీసీఎం దూసుకెళ్లడంతో 21 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్- రాంపూర్ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..నారాయణపేట జిల్లా మరికల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు కొద్ది రోజులుగా భూపాలపల్లి మండల పరిసర ప్రాంతాల్లో గొర్రెలను మేపుతున్నారు.
ఈ క్రమంలో గొర్రెలు బుధవారం కమలాపురం దాటి రోడ్డుపై వెళ్తుండగా ఆజంనగర్ వైపు వెళ్తున్న వల్లాల రమేష్ కు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఎస్ఐ ఉదయ్ కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని డీసీఎం డ్రైవర్నుర అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు