హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమోదైన నిరుద్యోగులను సైబర్ ముఠా మోసం చేసింది. వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఉద్యోగంలో చేరేందుకంటూ వివిధ పేర్లతో రూ.లక్షలో ఛార్జీలు వసూలు చేశారు. నిందితుల వద్ద 22 సెల్ఫోన్లు, 3 డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.