లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సోదాలు చేయగా ఒక పెట్టె కనిపించింది. తెరిచి చూడగా అందులో 33 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. 3849.120 గ్రామలు బరువున్న వీటి విలువ రూ.1,88,99,179 అని కస్టమ్స్ అధికారులు తెలిపారు. గోల్డ్ బిస్కెట్లను ఎవరు తెచ్చారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.