ప్రభుత్వ వైద్య సేవలు భేష్
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రూ. 8 కోట్లతో మౌలిక వసతులు
73 ఎకరాల సెంట్రల్ జైల్ స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్, ల్యాబ్
363 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకానికి సీఎం ఆదేశాలు
వరంగల్ చౌరస్తా, మే 10: కార్పొరేట్ దవాఖాన లను తలదన్నేలా ప్రభుత్వం వైద్యసేవలను విస్తరి స్తోంది. ఇప్పటికే కేఎంసీ ఆవరణలో వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేసి ఉత్తర తెలం గాణవ్యాప్తంగా బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూ పర్స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియా లజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రా లజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జ రీ, కార్డియో థెరాసిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ, ట్రామా కేర్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి రూ. 8 కోట్లు మంజూరు చేసింది. అవసరమైన వైద్యులు, పారా మెడికల్, ఫా ర్మాసిస్ట్ల నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఓరుగల్లులో రీజినల్ కార్డియాక్ సెంటర్
వరంగల్ నగరంలోని ప్రధాన రహదారిలో ఓ వైపు కా కతీయ మెడికల్ కళాశాల, మరో వైపు ఎంజీఎం, రీజి నల్ కంటి వైద్య బోధనా దవాఖానలు ఉన్న విషయం తెలిసిందే. దాని పక్కనే విశాలమైన 73 ఎకరాల స్థలం లోని సెంట్రల్ జైల్ను నగర శివారు ప్రాంతానికి తర లించి అందులో రీజినల్ కార్డియాక్ సెంటర్ను ఏర్పా టు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీం తోపాటు అవసరమైన ల్యాబ్ల నిర్మాణం చేపట్టనుం ది. ఇందులో భాగంగానే సెంట్రల్ జైల్ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు అప్పగించడానికి తగిన చర్యలు చేపట్టా లని ఆదివారం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయ డంతో అధికారులు కార్యాచరణ చేపట్టారు.