హైదరాబాద్ : తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మియాపూర్ నడిగడ్డ తండా సమీప క్యాంపులో బుధవారం చోటుచేసుకుంది. ఠాకూర్ శంకర్ అనే కానిస్టేబుల్ సీఆర్పీఎఫ్ క్యాంపులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. మృతుడి శంకర్ స్వస్థలం గుజరాత్.