లక్నో : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుద్వా ఫారెస్టు సమీపంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న శార్దా కెనాల్ వద్ద ఓ రైతు నిల్చొని ఉన్నాడు. ఆహారం కోసం వేచి చూస్తున్న మొసలికి రైతు కంటపడ్డాడు. దీంతో మెల్లగా ఒడ్డుకు చేరుకున్న మొసలి.. రైతు కాలిపై దాడి చేసింది. బలంగా కొరకడంతో రైతు కాలు చీలపోయి తీవ్ర రక్తస్రావమైంది. మొసలి దాడి చేయడంతో బాధిత వ్యక్తి కాపాడంటూ గట్టిగా అరిచాడు. పంట పొలాల్లో పని చేసుకుంటున్న మిగతా రైతులు అక్కడికి చేరుకుని కట్టెలతో మొసలిపై దాడి చేయడంతో.. బాధితుడి కాలిని వదిలిపెట్టింది. తీవ్ర గాయం కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం లక్నోకు తరలించారు. అయితే గత రెండు నెలల కాలంలో ఆ ఏరియాలో నలుగురు వ్యక్తులను మొసళ్లు చంపాయి.