హైదరాబాద్ : జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న వ్యక్తిపై జలమండలి విజలెన్స్ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో ఇంటి నెం 39-80/1లో నివాసం ఉంటున్న పి. రవి జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయంపై సంబంధిత యాజమాని రవిపై జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతి లేకుండా అక్రమ నల్లా కనెక్షన్ తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా కనెక్షన్ల ఏరివేతలో పౌరులు భాగస్వామ్యం కావాలని, 9989998100, 9989992268 నంబర్లకు అక్రమ నల్లా కనెక్షన్లపై సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా విజిలెన్స్ విభాగం అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్