ధారూరు : ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘట న ధారూరు మండల కేంద్రంలో గురువారం జరిగింది. ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం… ధారూరు మండల కేంద్రంలోని అషాపుర ఫ్యాక్టరీ సమీపంలో తాండూర్కు చెందిన ప్రముఖ వ్యాపారి కిషన్గోపాల్, శ్రీకాంత్ ఓ కారులో తాండూరు నుంచి హైదరాబాద్కు వ్యాపార నిమిత్తం వెళ్తుండగా.. అదే సమయంలో మంబాపూర్ గ్రామానికి చెందిన అనిల్, జయరాంతండాకు చెందిన వినోద్, రుక్మాపూర్ గ్రామానికి చెందిన నరేశ్ హైదరాబాద్ నుంచి తాండూర్ వైపునకు మరో కారులో అతి వేగంగా వస్తుండగా రెండు కార్లు ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని 108లో చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.