పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై తేలిన సంఘటన మండల పరధిలోని మిట్టకోడురు గ్రామంలో చోటు చేసుకుంది. మిట్టకోడురు గ్రామానికి చెందిన కాకి ప్రభు(35) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో వలలు కట్టి అందరూ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో చెరువు దగ్గర వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టారు.
గల్లంతైన ప్రభు కోసం గాలింపు చర్యలు చేస్తుండగా బుధవారం చెరువులో శవం లభించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పరిగి సర్కారు దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై క్రాంతికుమార్పాటిల్ తెలిపారు.