వరంగల్ చౌరస్తా : నగర నడిబోడ్డున జెపీఎన్రోడ్లో ఉన్న నిర్మలామాల్లో గుర్తు తెలియని మగ శిశువు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మాల్లోని 3వ అంతస్తులో ఉన్న వీ లవ్ సొసైటీ కార్యాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు సుమారు మూడు రోజుల వయస్సు కలిగిన మగ శిశువును వదిలి వెళ్లారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన సొసైటి సిబ్బంది శిశువును గుర్తించి ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకోని శిశువు మృతి చెందిందని నిర్థారించుకుని మృతదేహన్ని ఎంజీఎంకు తరలించారు. కార్పొరేషన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మల్లేష్ తెలిపారు.