అబ్దుల్లాపూర్మెట్ : గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దుకాణానికి కన్నంవేసి దొంగతనానికి పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ కేంద్రంలోని గణేష్దరి అనే వ్యక్తి శ్రీగణేష్ పవన్ బ్రోకర్, జువెలర్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణం నిర్వాహకుడు రాజస్తాన్కు వెళ్లడంతో దుకాణంలో పని చేస్తున్న సుమర్ దరి రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 7:30 గంటలకు దుకాణాన్ని సాధారణంగా తెరిచి చూసే సరికి వెండి అభరణాలు కనిపించలేదు.
గోడ వెనుక భాగంలో రంద్రం చేసి ఉంది. దుకాణంలో ఉన్న 3 కిలోల వెండి చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ స్వామి, డాగ్స్కాడ్, క్లూస్ టీం బృందాలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దుకాణం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.