నర్సంపేట రూరల్ : అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పల్తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన దారావత్ రఘురామ్ కుమారుడు దారావత్ రాజ్కుమార్ (17), మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా రాజ్కుమార్ ఆచూకీ లభించలేదు. తండ్రి రఘురామ్ ఈ నెల 25న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం రాజ్కుమార్ మృతదేహం ఓ వ్యవసాయ బావిలో కనిపించింది.
మృతుడి బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడా.. లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబాన్ని పలువురు నాయకులు పరామర్శించారు.