నల్లగొండ : నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన పోతుగంటి అనిల్ కుమార్, హయత్ నగర్ కు చెందిన ఉతాది జ్ఞానేశ్వర్ అలియాస్ గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలోని సైదిరెడ్డి అలియాస్ బబ్బుకు గంజాయి విక్రయిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు.
వారి వద్ద నుంచి సుమారు 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేయగా.. తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాధ్ అలియాస్ ప్రదీప్, తూర్పు గోదావరి జిల్లా బచ్చులూరు గ్రామానికి చెందిన వేమా జాన్ రెడ్డిలు తమకు విక్రయించినట్లు చెప్పారన్నారు. వీరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పని చేస్తున్నదని ఆయన తెలిపారు. డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి పర్యవేక్షణలో గంజాయి ముఠాను పట్టుకోవడంలో సమర్ధంగా పని చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ సదా నాగరాజు, టాస్క్ ఫోర్స్ సీఐ రౌతు గోపి, ఎస్.ఐ. అంతిరెడ్డి తదితరులను డిఐజి రంగనాధ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad |టీఆర్ఎస్వీ నేతలపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలు
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు