ఆందోల్/సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం..బాబానగర్ నాగయ్య (34) అనే వ్యక్తి జోగిపేట నుంచి చింతకుంట వెళ్తుండగా..ఎదురుగా వస్తున్న అర్టీసీ బస్సు బైకు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉడటంతో జోగిపేట ప్రభుత్వ దవాఖనకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Crime News | నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టివేత
Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వానలు..