ముంబై: పిల్లాడి కోసం ఇంట్లో వేసిన ఉయ్యాలే ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది. ఉయ్యాల్లో ఆడుకుంటున్న ఆ బాలుడు దానిలోనే చిక్కుకొని మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. అంధేరీ వెస్ట్లో ఒక ఇంట్లో ఈ ఘటన జరిగింది.
తల్లి అదే గదిలో మరోపక్క నిద్రపోతుండగా 9 ఏళ్ల బాలుడు ఇంట్లో వేసిన ఉయ్యాల ఊగుతూ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే ఉయ్యాల తాడులో ఇరుక్కున్నాడు. బయటపడటానికి అతను చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో సరిగా ఊపిరి అందక ఆ బాలుడు కన్నుమూశాడు. దీనిపై యాక్సిడెంటల్ డెత్గా కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.