షాబాద్ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్కు చెందిన బైండ్ల యాదయ్య (30) మరో ఇద్దరితో కలిసి మరియాపురంలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పహిల్వాన్ చెరువులోకి స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో యాదయ్య నీటమునిగి మృతిచెందాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయింశారు. మృతుడి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.