నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండలం మంచిప్ప హనుమాన్ తండాలో మంగళవారం చిరుత దాడిలో ఆవు మృతి చెందింది. తండాకు చెందిన రైతు దేవీసింగ్ తనకు చెందిన నాలుగు ఆవులను మేత కోసం ఊరి చివరకు తీసుకెళ్లాడు. ఆవులు మేత మేస్తున్న సమయంలో ఒక్కసారిగా చిరుతపులి దాడి చేయడంతో ఆవు అక్కడిక్కడే మృతి చెందింది. చిరుతను చూసిన దేవీసింగ్ అక్కడి నుంచి పరుగులు పెట్టి ప్రాణాలను దక్కించుకున్నాడు.
అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో హనుమాన్ తండా, మంచిప్ప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు