పొదరిల్లులా సిద్దిపేట జంక్షన్లు
అబ్బురపరిచే ఆకృతులు.. పచ్చిక బయళ్లు
వెలుగులు విరజిమ్మే వాటల్ ఫౌంటెన్లు
పట్టణంలోని అద్భుత సర్కిళ్లు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 17 : సిద్దిపేట పట్టణంలోని ప్రధాన రహదారికి ఏ మూలన వెళ్లినా అందమైన, ఆహ్లాదకరమైన జంక్షన్లే దర్శనమిస్తున్నాయి. ఏ చౌరస్తాలో చూసినా అందమైన ఫౌంటెన్లను చూసి ఫిదా అవ్వక తప్పని పరిస్థితి. సిద్దిపేట పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా మంత్రి హరీశ్రావు విశాలమైన రహదారులు వేయించడమే కాకుండా ప్రధాన రహదారులన్నీ అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా జంక్షన్ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్ల వెడల్పుతో పాటు జంక్షన్ల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే బ్లాక్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్రామ్ సర్కిల్, పొన్నాల జంక్షన్, డిగ్రీ కళాశాల సర్కిల్, సిరిసిల్ల బైపాస్ రోడ్ సర్కిల్, గద్ద బొమ్మ వద్ద టీ జంక్షన్ వద్ద చాయ్ కప్పు సాసర్ ఆకృతి, అమరుల స్మృతిలో రంగధాంపల్లి అమరవీరుల స్తూపం సర్కిల్, పొన్నాల జంక్షన్ వద్ద సిద్దిపేట వెల్కమ్ బోర్డుతో పాటు వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. గాడిచర్లపల్లి సమీపంలో గల నాగదేవత ఆలయం సర్కిల్ వద్ద భారీ శివాజీ విగ్రహాన్ని పెట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ చూడముచ్చటగా ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో రూ.25 లక్షల వ్యయంతో అంబేద్కర్ జంక్షన్ను సుందరీకరించారు. బావీస్ ఖానా పూల్ వద్ద వర్టికల్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఇది రాత్రి వేళల్లో మరింత సుందరంగా కనిపిస్తున్నది. వర్టికల్ గార్డెన్తోశబ్ద, గాలి కాలుష్యం తగ్గి, గ్రీన్ లైఫ్ను ఇస్తున్నాయి. దీంతో పాటు సిద్దిపేట, కరీంనగర్ బైపాస్ రోడ్డులోని నర్సాపూర్ జంక్షన్ అభివృద్ధి కోసం రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు.
ఇవి కూడా చదవండి
వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి: ప్రధాని మోదీ
వేల ట్విట్టర్ ఖాతాల డౌన్!ఎందుకంటే?!