అమరావతి : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతున్నది. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు సైతం వెనుకాడకపోవడం ఆందోళన రెకెత్తిస్తున్నది.
తాజాగా కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతోపాటు కుమారుడు, కోడలుకు నాలుగురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.