మంచిర్యాల : ఈ నెల 5వ తేదీన ఇద్దరు దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. భర్తకు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. భార్యకు స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్లో ఉన్నారు. అయితే భర్త కొవిడ్తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు దంపతులు చనిపోయారు. ఈ ఘటన జిల్లాలోని బెల్లంపల్లి హన్మాన్ బస్తీలో చోటు చేసుకుంది. మృతులను మొండెయ్య, జలజగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..