నాగర్కర్నూల్ : జిల్లాలోని పదర మండలం మద్దిమడుగు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగులమందు తాగి వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగేళ్ల కొడుకుతో సహా మహిళ యువకుడితో వెళ్లిపోయింది. ఇరువురు మద్దిమడుగు సమీపంలోని అడవి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగులమందు తాగారు. నల్లమల అడవిలో మృతదేహాల పక్కన బాలుడు ఏడుస్తూ కూర్చుకున్నాడు. పెద్దలు వచ్చేంత వరకు బాలుడు అడవిలోనే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అడవిలో బాలుడి ఏడుపు విని పెద్దలు బాలుడిని, మృతదేహాలను కనిపెట్టారు. మృతులు తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి వాసులు.