అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. లారీ అదుపుతప్పి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో దంపతులు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. ఆనందపురం మండలం బోయపాలెం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను విశాఖ నగరంలోని పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన సూర్యారావు (50), సత్యవతి (45)గా గుర్తించారు. లారీడ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.