ఆత్మకూరు, ఏప్రిల్ 2: మండలంలోని కామారం గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు డబుల్రోడ్డు నిర్మాణానికి రూ. 4.56 కోట్లు, కామారంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.10 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ధర్మారెడ్డికి టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్టీ గ్రామ అధ్యక్షుడు తోట కుమార్ ఆధ్వర్యంలో వారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్ కోట స్వరూప, సంజీవ్, ఎంపీటీసీ మందపల్లి మమత, ఉపసర్పంచ్ కాసర్ల శ్రీనివాస్, కంది కిషన్రెడ్డి, నరేందర్రెడ్డి, తోట శేఖర్, వరుణ్, రవీందర్, కాసర్ల లింగమూర్తి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు నాయకుల కృతజ్ఞతలు
నడికూడ: మండలంలోని పులిగిల్ల, నడికూడ, ధర్మారం గ్రామాల రహదారిని డబుల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచ్ ఊర రవీందర్రావు, ఎంపీటీసీ అప్పం చేరాలు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చంద్రమౌళి, సంగని వేణు, దుప్పటి పవన్, మొగిళి, నారగాని ఐలయ్య, రాజు, రమేశ్, రవీందర్, నారగాని రమేశ్, రంజిత్ ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
పిల్లిని ఫూల్ చేసిన పిచ్చుక.. వీడియో వైరల్