మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
సాయికుంట, వేంపల్లిలో కేంద్రాల ప్రారంభం
సద్వినియోగం చేసుకోవాలని సూచన
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 28 : కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. పట్టణంలోని సాయికుంటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.
వేంపల్లిలో..
హాజీపూర్, ఏప్రిల్ 28 : మండలంలోని వేంపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓలవు శారద, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ డేగ బాపు, రైతులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి :బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కాసిపేట, ఏప్రిల్ 28 : కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. మండలంలోని ధర్మరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మల్కేపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజులారెడ్డి, వాస్దేవ్, ఎంపీటీసీ భీంరావు, భూక్యా రాంచందర్, రొడ్డ రమేశ్, మడావి అనంతరావు, బందెల ప్రేమ్కుమార్, సల్లారి ప్రభాకర్, సహకార సంఘం వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :జడ్పీ ఉపాధ్యక్షుడు కృష్ణారావు
దహెగాం, ఏప్రిల్ 28 : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 80 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా ఉందన్నారు. రైతులు తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి క్వింటాలు ఏగ్రేడ్కు రూ 1888, బీ గ్రేడ్కు రూ 1868 మద్దతు ధర పొం దాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం లగ్గాం, ఒడ్డుగూడ, గిరివెల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి, కల్వాడ గ్రామాల్లో నూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆ యా కార్యక్రమాల్లో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, సర్పంచ్లు పుప్పాల లక్ష్మి, కోండ్ర అనుశ్, రైతు అమ్మక్క, కారు రాజన్న, లగ్గాం దామోదర్, రౌతు భాగ్యలక్ష్మి, హట్కరి గోపీబాయి, ఎంపీటీసీలు రా పర్తి జయలక్ష్మి, గౌరె రాకేశ్, డీఎస్వో స్వామికుమార్, డీఏవో శ్రీనివాస్, డీసీవో మహమూద్, అసిస్టెంట్ రిజిస్టార్ వెంకటరమ ణ, ఏవో శ్రీనివాస్, సీఈవో బక్కయ్య, సి బ్బంది, తుమ్మిడ నా రాయణ, జీవన్, సా యి, నాయకులు గజ్జల సురేశ్, సంతో ష్, మధుకర్, పాప య్య, నజీర్, ఏఈవోలు పాల్గొన్నారు.