టీటీడీ ప్రతిపాదనను నిరాకరించిన చరిత్రకారులు
బెంగళూరు, ఏప్రిల్ 12: హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని, అందుకు తగిన అన్ని ఆధారాలతో కూడిన పుస్తకాన్ని ఉగాది రోజు (మంగళవారం) విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన ప్రకటన మతపరంగా, పురాతత్వశాస్త్ర పరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. టీటీడీ ప్రకటనను చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు. రామాయణంలో పేర్కొన్న కిష్కింధ.. కర్ణాటకలోని హంపి లేదా దాని చట్టుపక్కల ప్రాంతమేనని చెప్తున్నారు. హంపి పరిసరాల్లోని పూర్వ చారిత్రక యుగపు చిత్రాల్లో తోక ఉన్న మనుషులను చిత్రించారని, తిరుమలలో అలాంటి ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీటీడీ మరింత సమయం తీసుకొని పరిశోధకులు, మత పెద్దలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని వీహెచ్పీ కర్ణాటక యూనిట్ పేర్కొన్నది.