పాట్నా, జూన్ 13: బీహార్ రాజధాని పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న 60 ఏండ్ల రోగి మెదడు నుంచి క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్ ఫంగస్ను విజయవంతంగా తొలగించారు. దాదాపు మూడు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి దీన్ని తొలగించామని, ప్రస్తుతం రోగి అనిల్కుమార్ పరిస్థితి నిలకడగా ఉన్నదని డాక్టర్ బ్రజేశ్ కుమార్ తెలిపారు. ఇంత పరిమాణంలో ఫంగస్ పెరుగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.