హైదరాబాద్ : నగరంలోని అమీర్పేట వద్ద గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ నివాసి ఎన్. వేణు బాబు(40) మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. బైక్పై వెళ్తుండగా అమీర్పేట సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. గాయాలపాలైన అతడిని సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.