స్వచ్ఛసుజల్ సంగ్రాహ పోర్టల్లో నమోదు
ఇచ్చోడ, ఏప్రిల్ 28: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్వచ్ఛ సుజల్ పోర్టల్లో ప్రశంసలు కురిపించింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు పనులతో గ్రామానికి ఈ ప్రశంసలు దక్కాయి. ఓడీఎఫ్ ప్లస్, బహిరంగ మల విసర్జన రహిత గ్రామం, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, తడి-పొడి చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువుల తయారీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులపై వీడియో సందేశాన్ని కేంద్ర జలవనరుల శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ మంత్రి గజానంద్ షెకావత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సుజల్ సంగ్రాహా పోర్టల్లో నమోదు చేశారు. ముక్రా (కే)ను అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.