న్యూఢిల్లీ : పిజ్జా అవుట్లెట్ డొమినోస్ యొక్క 18 కోట్ల మంది వినియోగదారుల డాటా లీక్ అయింది. వినియోగదారుల క్రెడిట్ కార్డుల వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఇజ్రాయెల్ సైబర్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ చేసిన ట్వీట్ ప్రకారం.. 13 టెరాబైట్ల డాటా లీక్ అయ్యింది. కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, చెల్లింపు వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారంతో పాటు 18 కోట్ల ఆర్డర్ వివరాల సమాచారం తమకు లభించిందని హ్యాకర్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో డొమినోస్ ఇండియా యాప్ నుంచి ఆర్డర్ చేసిన కస్టమర్ల పేర్లు కూడా ఉన్నాయి.
హ్యాకర్ అలోన్ గాల్.. డొమినోస్ ఇండియా హ్యాక్ చేసిన డాటాను డార్క్ వెబ్లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిఫలంగా హ్యాకర్లు రూ. 4 కోట్లు ఇవ్వాలని (5,50,000 డాలర్లు) డిమాండ్ చేస్తున్నారు. సెర్చ్ పోర్టల్ సృష్టించే వారికి మాత్రమే ఈ డాటాను విక్రయించాలని హ్యాకర్లు అనుకుంటున్నారంట.
అయితే డొమినోస్ ఇండియా ఈ విషయంలో ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. వారి సర్వర్ నుంచి డాటా లీక్ అయినట్లు ధ్రువీకరించనూ లేదు.
ఫేస్బుక్కు సంబంధించి 53 కోట్ల మంది వినియోగదారుల డాటా కూడా గత వారం లీక్ అయినట్లు సమాచారం. ప్రపంచంలోని 106 దేశాల్లో నివసిస్తున్న 53.3 మిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డాటా బయటపడింది. ఇది కాకుండా, ఇటీవల 500 మిలియన్ల లింక్డ్ఇన్ వినియోగదారుల డాటా లీక్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ డాటాను ఫోరంలో హ్యాకర్ అమ్మకానికి ఉంచినట్లు సమాచారం. ఇందులో 61 లక్షల మంది భారతీయ వినియోగదారుల డాటా కూడా ఉండటం విశేషం.
‘ఇప్పటివరకు బహిర్గతమైన చాలా కేసుల్లో వారు పంపిణీ చేసే మార్కెటింగ్ సౌలభ్యం ప్రకారం హ్యాకర్ డాటా వివిధ మార్గాల్లో వేరు చేయబడిందని తెలిసింది. దొంగిలించిన డాటాను అవసరమైన వారికి అమ్ముకుంటుంటారు. ఈ డాటా అవరమైన కంపెనీలు లేదా రాజకీయ పార్టీలకు హ్యాకర్లు అమ్ముతారు. సైబర్ నేరస్థులు కూడా తరచుగా హిట్ అండ్ రన్ ప్రొఫైల్స్ ఉపయోగిస్తారు. అంటే, ఒకరి ప్రొఫైల్ను హ్యాక్ చేయడానికి మొబైల్ నంబర్ను యూజర్ ఐడీ లేదా పాస్వర్డ్గా ఉపయోగిస్తారు. దానిని రీడీమ్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది హ్యాకర్లు వీవీఐపీ నంబర్లను కూడా పొంది చాలా ఖరీదైన ధరలకు అమ్ముతారు’ అని జైపూర్ పోలీసులతో సైబర్క్రైమ్ కేసుల్లో పరిశోధన చేసే సీటీఓ ముఖేష్ చౌదరి వివరించారు.
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..