చెన్నై: పెద్ద సంఖ్యలో నక్షత్ర తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్టులో బుధవారం ఈ ఘటన జరిగింది. థాయ్లాండ్కు ఎగుమతి చేసేందుకు పది బాక్సుల్లో ఉంచిన 2,247 జీవించి ఉన్న ఇండియన్ స్టార్ తాబేళ్లను చెన్నై ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రాష్ట్ర అటవీ శాఖకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ అధికారులు తెలిపారు.