వరంగల్ అర్బన్ : ప్రేమ పేరుతో దగ్గరై పెండ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం 3 నెలల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో బాధితురాలి పక్షాన వాదించిన ప్రాసిక్యూటర్ మర్రి వాసుదేవరెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని రంగశాయిపేటకు చెందిన సంగిశెట్టి నాగ అశోక్ గజపతి అనే నిందితుడు.. ఉర్సు ప్రాంతానికి చెందిన బాధిత యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెండ్లి చేసుకుందామన్నాడు. చివరకు మరో యువతిని పెండ్లి చేసుకుంటున్నాడని తెలిసి బాధితురాలు మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించింది.
అప్పటి ఇన్స్పెక్టర్ దయాకర్ కేసు దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు లో విచారణ 9వ అదనపు జిల్లా కోర్టులో (ప్రత్యేక మహిళల కోర్టు) జరిగింది. సాక్షాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ముక్తిద నిందితునికి 3 నెలల జైలుశిక్ష విధించింది. జైలుకు వెళ్లలేని పరిస్థితిలో రూ.25 వేల జరిమానా బాధితురాలికి చెల్లించాలని గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో కోర్టు డ్యూటీ ఆఫీసర్ డి. ప్రతాప్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద