ముంబై : ప్రియురాలి(౩౩)ని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన అనంతరం చార్టెడ్ అకౌంటెంట్(54) థానే హోటల్లోని నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేపింది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన అనంతరం ఆమె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయనున్నారు. బార్లో పనిచేసే ఈ మహిళ కోసం చార్టెడ్ అకౌంటెంట్ రూ కోటి వరకూ ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. మహిళను కత్తితో పొడిచిన అనంతరం బలవన్మరణానికి పాల్పడిన సీఏను శోభారాజ్ ఆర్గా గుర్తించారు.
రెండేండ్ల కిందటపరిచయమైన వీరిద్దరూ తరచూ హోటల్ రూమ్స్లో కలుస్తుంటారని, మహిళ నిత్యం ఆయనను డబ్బు ఇవ్వాలని కోరుతుండేదని పోలీసులు తెలిపారు. తరచూ డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో ఆగ్రహించిన శోభారాజ్ ఆమెను చంపేందుకు స్కెచ్ వేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆమెను హోటల్లో కలిసే సమయంలో శోభారజ్ వద్ద కిచెన్ నైఫ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళ పొత్తి కడుపు, ముఖం సహా పలు శరీర భాగాల్లో కత్తి పోట్లతో దాడిచేసిన చార్టెడ్ అకౌంటెట్ ఆమె చనిపోయి ఉంటుందని భావించి హోటల్ రూమ్ కిటీకి నుంచి కిందకు దూకగా ఆయన ఘటనా స్ధలంలోనే మరణించారు. మరోవైపు హోటల్ సిబ్బంది సమాచారంతో మహిళను హుటాహుటిన దవాఖానకు తరలించగా, శోభారాజ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.