జైపూర్: ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మనీష్ సింధి (40)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పనిమనిషి వెళ్లేసరికి మనీష్ సింధి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఆమె తలుపులు ఎంత తట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచింది.
దాంతో ఇరుగుపొరుగు వచ్చి కూడా తలుపులు తట్టారు. అయినా తీయకపోవడంతో కిటీకిలు తెరిచి చూసి షాకయ్యారు. లోపల మనీష్ సింధి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుజరాత్లో ఓ ఫంక్షన్కు వెళ్లిన అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. అయితే, మనీష్ సింధి ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.