చెన్నై : ఐఐటీ మద్రాస్లో ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఉన్ని కృష్ణన్ (30) ఐఐటీ మద్రాస్లో గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గురువారం ఉదయం కేరళ నుంచి క్యాంపస్కు చేరుకున్న కృష్ణన్ హాకీ గ్రౌండ్ సమీపంలో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెక్చరర్ మృతదేహాన్ని గమనించిన స్పోర్ట్స్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణన్ గది నుంచి 11 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణన్ తండ్రి ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నాడు.