నాగర్కర్నూల్/కొల్లాపూర్ రూరల్ : కొల్లాపూర్ రూరల్ మండలంలోని చిన్న తండా సమీపంలో సోమవారం చైన్ స్నాచింగ్ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుడికిళ్ల గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ సోమవారం ఉదయం పది గంటలకు తమ వ్యవసాయం పొలం వద్దకు వెళ్తున్నది.
ఈ క్రమంలో గోల్లోని బీడు పొలం దగ్గరికి వచ్చేసరికి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఆమె దగ్గరికి వెళ్లి దారి అడుగుతున్నట్లు నటిస్తూ అకస్మాత్తుగా మెడలోని 3 తులాల గొలుసును తెంచుకొని బైక్ పై నార్లాపూర్ గ్రామం వైపు పరారయ్యారు.
సోమవారం మధ్యాహ్నం బాధిత మహిళ మంజుల కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామస్వామి గౌడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు