హైదరాబాద్ : బస్స్టాప్లో నిలబడిన మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బోరబండ సైట్ 2లో నివాసం ఉంటున్న అలివేలు(42) అనే మహిళ బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో హౌజ్కీపింగ్ పనిచేస్తుంటుంది.
బుధవారం డ్యూటీకి వెళ్లే క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని పెద్దమ్మ గుడి ఎదురుగా ఉన్న బస్స్టాప్లో బస్ ఎక్కేందుకు ఆమె వచ్చింది. అదే సమయంలో నెంబర్ ప్లేట్ లేని పాత హోండా యాక్టివా బైక్ మీద వచ్చిన ఓ అగంతకుడు అలివేలు మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.
దీంతో బాధితురాలు తన రెండున్నర తులాల గొలుసును స్నాచర్ లాక్కెళ్లాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందతుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు!