కాచిగూడ : రైల్వేస్టేషన్లో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. గోరక్పూర్, తిప్రాచి మండలం, జమీనిర్యా గ్రామానికి చెందిన రామ్బజాన్ కుమారుడు పరమిందర్ రస్యా (42) వృత్తిరిత్యా కూలి. జులాయిగా తిరుగు తూ రద్దిగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలిపారు.
నాలుగు రోజుల క్రితం కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం-1 పై పడుకున్న ప్రయాణీకుడి ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించా డు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వేపోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారంలో తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా కనపడిన పరమిందర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆతను చేసిన సెల్ఫోన్ దొంగతనం ఒప్పుకున్నాడు. బుధవారం పరమిందర్ రస్యాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు హెడ్కానిస్టేబుల్ బీజీ ప్రసాద్ తెలిపారు.