దోమ : ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేసి వదిలేసిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన ఏండ్ల బాలికకు కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో ఆరు నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమ వ్యవహారంగా మారి పెళ్ళి వరకు దారితీసింది. సదరు బాలికను పెళ్ళి చేసుకుంటానని మాయమాలతో నమ్మించి నాలుగు నెలల గర్బవతిని చేశాడు వెంకటేష్.
మోజు తీరిన తరువాత అబార్షన్ చేసి వదిలించుకుందామని స్కెచ్ వేయడంతో విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు వెంకటేష్ ను నిలదీయడంతో 10 లక్షలు, ఐదు తులాల బంగారం ఇస్తేనే మేజర్ అయ్యాక పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో చేసేదేమీ లేక బాలిక తల్లిదండ్రులు శుక్రవారం దోమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రమేష్ ఆ యువకుడిపై అత్యాచారం, ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.