బంజారాహిల్స్ : నిషేధిత గుట్కాలను విక్రయిస్తున్న కిరాణాషాపు నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ సమీపంలోని హకీంపేటలో నివాసం ఉంటున్న సయ్యద్ జునైద్ అనే వ్యక్తి కిరాణాషాపు నడిపిస్తుంటాడు. గత కొన్నిరోజులుగా తన షాపులో గుట్కాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు.
పాతబస్తీకి చెందిన అక్రమ్ అనే వ్యక్తినుంచి గుట్కాలు కొనుగోలు చేసి కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. షాపులో నుంచి సుమారు రూ.20వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకుడు జునైద్తోపాటు అక్రమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.