బంజారాహిల్స్ : ప్రేమ పేరుతో బాలికను నమ్మించి లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్లో నివాసం ఉంటున్న బాలిక (17) ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న భీమ్రాజ్ (23) అనే యువకుడు గత కొంతకాలంగా బాలికతో స్నేహం చేస్తున్నాడు.
ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు తనతో పాటు బైక్పై ఇందిరానగర్లోని బంధువు గదికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. దాంతో మౌనంగా ఉన్న బాలిక ఇటీవల ముభావంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు బాధితు రాలి తండ్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు భీమ్రాజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.