హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో యువతి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన యువతిని ఆశ్రితగా పోలీసులు గుర్తించారు. అభిషేక్ అనే యువకుడు మద్యం మత్తులో అతివేగంగా కారును నడపటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.