నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన
జిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నాయనపల్లి మైసమ్మ వద్దకు పోయి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పెంట్లవెల్లి మండల కేంద్రం సమీపంలోని నమాజ్ కట్ట వద్ద జటప్రోలు నుంచి ఎదురుగా వస్తున్న కారు జీపును ఢీకొట్టడంతో జీప్లో ఉన్న రఫీ, కురుమయ్య, లక్ష్మి, జ్యోతిలకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను కొల్లాపూర్ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత