హైదరాబాద్ : ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఈటల తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాజకీయ భవిష్యత్ను ఇచ్చిన సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో హరీశ్రావును కాదని ఈటలకు.. కేసీఆర్ ఫ్లోర్లీటర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తనవి ఉద్యమ భావజాలాలు అని చెప్పుకుంటున్న ఈటల వరవరరావును జైలులో పెట్టిన పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీతో ఈటల జట్టు కట్టడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎంపై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్తో ఆరేండ్ల గ్యాప్ ఉంటే ఈటల మంత్రి ఎలా అయ్యారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పుడు ఈటల బీజేపీలో చేరి చమురు ధరలు తగ్గిస్తారా.? అని ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.