హైదరాబాద్ : లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్రోడ్పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలు అందులో ఇరుకుపోయగా.. వాటిని పోలీసులు వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హైదరాబాద్ సరూర్నగర్కు చెందిన ఉపేంద్రనాథ్, రోషిక్, ప్రభాకర్గా గుర్తించారు. ఇద్దరు తండ్రీకొడుకులు కాగా.. మరొకరు డ్రైవర్. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులుత తెలిపారు.