వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఒకేరోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో 318 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 11 మంది నిందితులను అరెస్టు చేసి, గంజాయితోపాటు రెండు కార్లు, మూడు ఆటోలు, 11సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం హనుమకొండ వరంగల్ పోలీసు కమిషనేట్ కార్యాలయంలో నిందితుల వివరాలను సీపీ డాక్టర్ తరుణ్జోషి వెల్లడించారు.
వర్ధన్నపేటకు చెందిన బోరం సాయికుమార్, ఈస్ట్గోదావరి జిల్లా గాటంపల్లికి చెందిన వెంకట్, గోదపర్తి వెంకట్, మహబుబా బాద్కు చెందిన భూక్య రాములు, ఎస్కే కలీల్, కరీంనగర్కు చెందిన కొనమల సునీల్, భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన సారపాకకు చెందిన బత్ర నరేష్, తూమూల క్రాంతికుమార్, తుమూల నాగరాజు, జీ మనోజ్, మారంపడి శ్రీను జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ముఠాలుగా ఏర్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతం సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రహస్యంగా కారులో విశాఖపట్నం, రాజమండ్రి, భద్రాచలం కొత్తగూడెం, నర్సంపేట, ఖమ్మం ద్వారా వరంగల్ నగరంల మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసునేవారు.
నిందితుల వివరాలు టాస్క్ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం తెలియడంతో టాస్క్ఫోర్స్, వర్ధన్నపేట పోలీసులు ఖమ్మం-వరంగల్ రహదారి డీసీ తండా వద్ద వాహనాలు తనిఖీ చేయగా, కారులో 128 కిలోల గంజాయి దొరికింది. టాస్క్ఫోర్స్, నల్లబెల్లి పోలీసులు కలిసి నల్లబెల్లి శివారులో వాహనాలు తనిఖీ చేయగా కారు, ఆటోలో 134 కిలోల గంజాయి దొరికింది.
ఖానాపూర్లో రెండు ఆటోల్లో 56 కిలోల గంజాయి దొరికింది. ఈ సంఘటనలో 11మంది నిందితులను పట్టకోవడంలో ప్రతిభ కనభరిచిన వెస్ట్జోన్, ఈస్ట్ జోన్ డీసీపీలు శ్రీనివాస్రెడ్డి, వెంకటలక్ష్మి, టాస్క్ఫోర్స్ వర్ధన్నపేట, నర్సంపేట ఏసీపీలు ప్రతాప్కుమార్, ఫణిందర్, సీఐలు సదన్కుమార్, సతీశ్, సంతోష్, సిబ్బందిని అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Crime News | ధనలక్ష్మిపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీష్ రెడ్డి
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో