రంగారెడ్డి : విద్యుత్ షాక్తో లేగ దూడలు మృతి చెందాయి. ఈ విషాదకర సంఘటన కేశంపేట మండలం మంగలి గూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..కొట్టం నరేందర్రెడ్డికి చెందిన లేగదూడలు పొలంలో మేత మేస్తుండగా విద్యుత్ లైన్ తెగిపడింది. లేగదూడలకు విద్యుత్ వైర్లు తగడలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కాలం చెల్లిన చెల్లిన విద్యుత్ వైర్లను మార్చాలని ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా విద్యుత్ వైర్లు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.