హైదరాబాద్ : నగరంలోని హఫీజ్పేట్లో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. హఫీజ్పేట్లో నివాసముంటున్న క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ఫరీద్(35)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. క్యాబ్ డ్రైవర్ మృతదేహం హాఫీజ్పేట్ బ్రిడ్జి కింద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు రోజుల క్రితం ఫోన్ రాగానే.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్తున్నట్లు తమకు చెప్పి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.