కోనరావుపేట /రాజన్న సిరిసిల్ల : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సఫాయి కార్మికుడి పూరిగుడిసె దగ్ధమైన ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంట రాజు అనే వ్యక్తి గ్రామపంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఇల్లు లేక ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో పూరి గుడిసె వేసుకొని జీవిస్తున్నాడు.
దీంతో గుడిసెలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో గుడిసెతో పాటు అందులో ఉన్న వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కాగా, రాజు భార్య మౌనిక గర్భంతో ఉంది. ఈ క్రమంలో మౌనిక కూడా పల్లె ప్రకృతి వనంలో చెట్లకు నీళ్లు పడుతూ కాలం వెల్లదీస్తున్నది. దీంతో ఆమె చికిత్స కోసం దాచిన రూ. 30,000 నగదుతో పాటు పుస్తెల తాడు కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబానికి సర్పంచ్ సంతోష్ 5,000 నగదు తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి 1,0016 తక్షణ సాయం అందించారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి