రాయ్పూర్ : ఆన్లైన్ గేమ్ కోసం ఆయుధాల కొనుగోలుకు 12 ఏండ్ల బాలుడు తల్లి ఖాతా నుంచి రూ 3.2 లక్షలు వెచ్చించిన ఘటన చత్తీస్ఘఢ్లోని కంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఏడాది మార్చి 8 నుంచి జూన్ 10 మధ్య బాలుడు ఏకంగా 278 లావాదేవీలు జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కుమారుడు జరిపిన లావాదేవీలకు ఎలాంటి ఓటీపీ రాకపోవడంతో తాను ఈ వ్యవహారం గుర్తించలేదని బాలుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ 3.2 లక్షల సైబర్ ఫ్రాడ్ జరిగినట్టు బాధితుడి తల్లి వాపోయారు.
కంకేర్ జిల్లాలో ఆమె స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. బాలుడి గ్రూపులో మరో ఇద్దరు చిన్నారులు కూడా ఈ గేమ్ ఆడిన వారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు కూడా రూ లక్షల విలువైన వెపన్స్ కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. జూన్ 25న తన బ్యాంక్ ఖాతాలో రూ 3.2 లక్షలు డిడక్ట్ కావడంతో ఆమె సైబర్ ఫ్రాఢ్గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ నుంచే అన్ని లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ కోసం ఆమె కుమారుడు అడిషనల్ ఫీచర్స్, వెపన్ అప్గ్రేడ్స్పై ఈ మొత్తం ఖర్చు చేసేలా పలు లావాదేవీలు నిర్వహించాడని తేలింది.